Beauty Tips: గ్రీన్‌ టీ.. బియ్యం పిండి, తేనె.. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!

20 Oct, 2022 10:20 IST|Sakshi

ముఖ చర్మం శుభ్రపడి.. నిగారింపు సంతరించుకోవాలంటే ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి!
గ్రీన్‌ టీ మాస్క్‌!
►కప్పు గ్రీన్‌ టీలో రెండు స్పూన్ల బియ్యం పిండి, అరస్పూను తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.
►20 నిమిషాలపాటు ఆరనిచ్చి, తరువాత ఐదు నిమిషాలపాటు ముఖంపైన గుండ్రంగా మర్దనా చేయాలి.
►ఆ తరువాత ముఖం కడుక్కోవాలి.
►వారానికి రెండు సార్లు ఈ మాస్క్‌ వేసుకుంటే ముఖ నిగారింపు మెరుగుపడుతుంది. 

లెమన్‌ మాస్క్‌!
►శనగపిండి, పసుపు, నిమ్మరసం, పచ్చిపాలను ఒక్కోస్పూను తీసుకుని మెత్తని పేస్టులా కలుపుకోవాలి.
►ఈ పేస్టును ముఖానికి రాసి మర్దనా చేసుకోవాలి.
►20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి.
►ఇలా చేయడం వల్ల ముఖచర్మం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది. 

చదవండి: Beauty Tips: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్‌ తగ్గుముఖం పట్టడం ఖాయం! ఇక పసుపుతో కలిపి పెడితే..
Health Tips: నట్స్‌, డార్క్‌ చాక్లెట్స్‌, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల చేసి..

మరిన్ని వార్తలు