Beauty Tips: మెంతి, కరివేపాకు, కీరదోస.. ఈ ప్యాక్‌తో ముఖం మీది రంధ్రాలు, డార్క్‌ సర్కిల్స్‌ మాయం!

3 Jun, 2022 12:00 IST|Sakshi

మెంతి.. ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే  గుణాలు కూడా దీని సొంతం. ఈ మెంతి ప్యాక్‌ ట్రై చేశారంటే ముఖం మీది రంధ్రాలు మాయం కావడం ఖాయం.

ఇలా చేయండి
👉🏾రాత్రంతా నానబెట్టుకున్న టీస్పూను మెంతులను, నీళ్లు తీసేసి మిక్సీ జార్‌లో వేయాలి.
👉🏾దీనికి ఆరు వేపాకులు, రెండు కీరదోసకాయ ముక్కలు జోడించి పేస్టుచేయాలి.
👉🏾ఈ పేస్టులో టీస్పూను ముల్తానీ మట్టి, అరటీస్పూను నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి.
👉🏾ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి.


👉🏾తరువాత చేతులని తడిచేసుకుని ఐదు నిమిషాలపాటు మర్దనచేసి చల్లటి నీటితో కడిగేయాలి.
👉🏾వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖం మీద కనిపిస్తోన్న రంధ్రాలు, డార్క్‌ సర్కిల్స్, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి.
👉🏾ముఖ చర్మం బిగుతుగా మారి, మృదువైన నిగారింపుని సంతరించుకుంటుంది. 
👉🏾మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్‌ గుణాలు ముఖచర్మానికి తేమనందించి  ఆరోగ్యంగా ఉంచుతాయి. 

చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్‌.. ట్యాన్‌, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips: ముడతలు, బ్లాక్‌ హెడ్స్‌కు చెక్‌.. ఈ డివైజ్‌ ధర రూ. 2,830

మరిన్ని వార్తలు