Beauty Tip: సోప్‌ కాని సోప్‌.. ఈ మిశ్రమం చర్మ నిగారింపు పెంచడంతో పాటు..! 

15 Apr, 2022 12:27 IST|Sakshi

బ్యూటిప్‌

కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు,  ఐదు టేబుల్‌ స్పూన్ల కల్లుప్పు, రెండు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్, రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెర జెల్‌ వేసి బాగా కలపాలి. 

స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.

తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది. 

ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకోవడం వల్ల చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకుంటుంది. 

మరిన్ని వార్తలు