చిన్న పరికరంతో వెక్కిళ్లు మటుమాయం

11 Jul, 2021 15:18 IST|Sakshi

వెక్కిళ్లు వస్తే చాలా మంది నీళ్లు తాగుతారు. ఆగకుంటే.. నిమ్మకాయ, అల్లం ముక్క నమలడం వంటì చిట్కాలను పాటిస్తారు. అప్పుడు కూడా వెక్కిళ్లు తగ్గకుంటే ..?  వెంటనే ఈ ఎల్‌ షేప్‌ స్ట్రాతో నీళ్లను సిప్‌ చేయండి. చిటికలోనే వెక్కిళ్లన్నీ మాయం. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందించారు. పేరు ‘ద ఫోర్స్‌డ్‌ ఇన్‌స్పిరేటరీ సక్షన్‌ అండ్‌ స్వాలో టూల్‌’. చూడ్డానికి ఓ చిన్నపాటి గొట్టంలా కనిపిస్తుంది. ఓ వైపు మౌత్‌ పీస్, మరో వైపు ప్రెషర్‌ వాల్వ్‌తో ఉండే దీనిని సుమారు 249 మందిపై ప్రయోగించారు.

దీంతో నీటిని సిప్‌ చే స్తే దాదాపు 92 శాతం వెక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ పరికరాన్ని ఇప్పుడు మార్కెట్‌లోకి అనుమతించింది ప్రభుత్వం. ప్రస్తుతం వివిధ కంపెనీల వారు, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ధర రూ. వెయ్యి నుంచి రెండు వేలకు పైగా ఉంటుంది. ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ లభ్యం.

మరిన్ని వార్తలు