గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న రాగిజావ, చిక్కీ పంపిణీ వేళల్లో మార్పులు చేస్తూ మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధిమీనా ఉత్తర్వులు విడుదల చేసినట్లు డీఈవో పి.శైలజ శుక్రవారం తెలిపారు. ఈ నెల 21న ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాగిజావ పంపిణీ ప్రక్రియ వారంలో మూడు రోజుల పాటు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8.45కల్లా అందజేయాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఫౌండేషన్ స్కూళ్లలో ఆయా రోజుల్లో ఉదయం 10:35కు, హైస్కూళ్లలో ఉదయం 10:45కు రాగిజావ పంపిణీ చేయాలని తెలిపారు. చిక్కీని మధ్యాహ్న భోజనం తరువాత విద్యార్థులకు అందజేయాలని డీఈవో శైలజ హెచ్ఎంలను ఆదేశించారు.
ఉర్దూ పాఠశాలల పనివేళల్లో
మార్పులను అమలు చేయాలి..
రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను అమలుపరచాలని డీఈవో శైలజ పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు ఏప్రిల్ 22 వరకు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పని చేసేలా పర్యవేక్షించాలని డీవైఈవోలు, ఎంఈవోలతో పాటు ఉర్దూ డీఐని ఆదేశించారు.
పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్
నిజాంపట్నం: నిజాంపట్నం పీఏసీఎస్ సీఈవో మోపిదేవి నాగేశ్వరరావును 6 నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చైర్మన్ మరకా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నిజాంపట్నంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి ఇన్కంట్యాక్స్ రిటర్న్స్ను పంపకపోవడం, 2018–19 నుంచి ఐటీ రిటర్న్స్ను సంఘం పేరున ఉన్న పాన్కార్డుపై కాకుండా సంఘ అధ్యక్షుడి పాన్కార్డు ద్వారా పంపడం, సంఘ సభ్యులు కొంత మందివి పాస్బుక్లు పోగొట్టడం వంటి పలు అవకతవకలపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.