ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

25 May, 2023 01:28 IST|Sakshi
ఆర్టీసీ రాజఽఽధాని బస్సు

స్టేషన్‌ఘన్‌పూర్‌ : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మీదికొండ క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా కారులో ప్రయాణిస్తున్న నేహారామ్‌(25), వసుంధర దేవి(47) మృతి చెందగా దేవరపల్లి జీవన్‌బాబు తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాలిలా.. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన దేవరపల్లి జీవన్‌ బాబు, అతని భార్య వసుంధర దేవి, కూతురు నేహారామ్‌ హైదరాబాద్‌ నుంచి మీదికొండకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్లే క్రమంలో మండలంలోని మీదికొండ క్రాస్‌ రోడ్డు సమీపంలోని దాబా హోటల్‌కు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు మీదికొండ క్రాస్‌ వద్ద రోడ్డు క్రాస్‌ చేసేందుకు వెళ్తుండగా హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వస్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నేహారామ్‌ అక్కడి కక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన వసుంధర దేవి, జీవన్‌ బాబులను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా వసుంధర దేవి మార్గమధ్యలో మృతి చెందింది. జీవన్‌ బాబు వరంగల్‌లోని ఎంజీఎంలో చికిత్స పొందు తున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌ తెలిపారు.

కారును ఢీకొట్టిన ఆర్టీసీ

‘రాజధాని’ బస్సు

మరొకరి పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు