ఆత్మాహుతి దాడి: 13మంది మృతి, 120 మందికి గాయాలు

19 Oct, 2020 08:13 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో కారు బాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మరణించగా, 120 మంది గాయపడిన దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పశ్చిమ అఫ్గాన్‌లోని ఘోర్‌ ప్రావిన్స్‌లో ఉన్న ప్రావిన్సియల్‌ పోలీస్‌ చీఫ్‌ ఆఫీసర్‌ భవనం వద్ద ఈ ఘటన జరిగింది. తాలిబాన్లకు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి మధ్య ఖతార్‌లో మొట్టమొదటి భేటీ జరిగిన సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.   (తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!)

మరిన్ని వార్తలు