ఆస్ర్టియా రాజధాని  వియ‌న్నాలో ఉగ్ర‌దాడి

3 Nov, 2020 09:36 IST|Sakshi

వియ‌న్నా :ఆస్ర్టియాలో రాజధాని  వియ‌న్నాలో సోమ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడి జ‌రిగింది.  హిల్ట‌న్ హోట‌ల్‌లోని ప‌ర్యాట‌కుల‌ను బందీలుగా చేసుకొని ముంబై త‌ర‌హాలోనే ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పౌరులు మృతిచెంద‌గా, ప‌లువురికి గాయాల‌య్యాయి.  వియ‌న్నాలోని దాదాపు  ఆరు ప్రాంతాల్లో  ముష్క‌రులు ఈ  కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. వెంట‌నే ఆర్మీని రంగంలోకి దించిన ఆస్ట్రియా ప్రభుత్వం.. వియ‌న్నా ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకుంది. భ‌ద్ర‌తా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం మ‌రొక నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. అటోమెటిక్ మొబైల్ సిస్ట‌మ్ ద్వారా ఉగ్ర‌వాదులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. వియన్నా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని  మంత్రి నెహ‌మ్మర్ తెలిపారు.  (కాబూల్‌ వర్సిటీలో కాల్పులు )

క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఆస్ర్టేలియాలో పాక్షిక లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఈ దాడి జ‌రిగింది. అప్ప‌టికే కొన్ని రెస్టెంట్లు, కేఫ్‌లు మూసిఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఉగ్ర క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టామ‌ని, ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు రావాల‌ని పేర్కొన్నారు. ఈ ఉగ్ర‌దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి సంఘీబావం తెలియ‌జేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు