పాకిస్తాన్‌లో భారీ భూ ప్రకంపనలు

29 Jan, 2023 17:13 IST|Sakshi

పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది. తజకిస్తాన్‌లో భూకంప కేంద్రం ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. సుమారు 150 కిలోమీటర్లు లోతుల్లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.54 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి తదితర ప్రాంతాలో భారీ భూ ప్రకంపనాలు సంభవించాయి. ఐతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అందుకు సంబంధించిన నివేదిక ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2005లో పాక్‌లో సంభవించిన భూకంపంలో సుమారు 74 వేల మందికి పైగా మరణించారు.

(చదవండి: లంక పరిస్థితులు పాకిస్తాన్‌లో రిపీట్‌.. చేతులెత్తేసిన పాక్‌ సర్కార్‌!)

మరిన్ని వార్తలు