భారత ప్రయాణికులపై చైనా ఆంక్షల కొనసాగింపు

15 Sep, 2021 13:06 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో చదువుతున్న భారత విద్యార్థులను, పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి చైనాలోకి అనుమతించడంపై ఆ దేశం ఆంక్షలను కొనసాగిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన ఉద్యోగులను తిరిగి చైనాలోకి తీసుకొచ్చేందుకు ఆ దేశం తాజాగా చార్టర్డ్‌ విమానాలకు అనుమతులు జారీ చేసింది. అయితే భారత్‌ నుంచి 23 వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో ఉద్యోగులు వారి కుటుంబాలు చైనా వెళ్లడం కోసం వేచి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో  చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పందిస్తూ.. చైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్న దేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుంటుందని ఆయన వెల్లడించారు.

చదవండి: Afghan: అఫ్గన్‌ కేంద్రంగా దాడులు జరగనివ్వం

మరిన్ని వార్తలు