-

భారత్‌-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ

20 Jan, 2023 18:46 IST|Sakshi

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్‌లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్‌పింగ్‌.

ఈ మేరకు ఆయన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్‌పింగ్‌ ఖుంజెరాబ్‌లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్‌పింగ్‌కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్‌పింగ్‌ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్‌పింగ్‌ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు.

కాగా, ఇదే తూర్పు లడఖ్‌ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్‌ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్‌ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్‌ సరిహద్దు స్టాండ్‌ ఆఫ్‌పై భారత్‌, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్‌ నొక్కి చెప్పింది.

(చదవండి: పుతిన్‌ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్‌స్కీ షాకింగ్‌ వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు