చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..

24 Aug, 2020 17:46 IST|Sakshi
వెంటిలేటర్‌పై సితి

జకార్తా : చనిపోయిన ఓ బాలిక అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా మళ్లీ ఊపిరి పీల్చుకోవడం కుటుంబసభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. వారి కళ్లలో సంతోషాన్ని నింపింది. అయితే ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. ఈ వింత సంఘటన ఇండోనేషియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, ఈస్ట్‌ జావాకు చెందిన సితి మస్‌ఫుఫాహ్‌ వర్దాహ్‌ అనే 12 ఏళ్ల బాలిక క్రోనిక్‌ డయాబెటీస్‌తో బాధపడుతూ ఈ నెల 18న అక్కడి ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. దీంతో సితి మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు కుటుంబసభ్యులు. అంత్యక్రియల కోసం శవాన్ని సిద్ధం చేయటానికి ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయించారు. స్నానం అనంతరం సితి శరీరం వెచ్చగా మారింది. ( కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్‌ )

మూసుకున్న కళ్లు ఠక్కున తెరుచుకున్నాయి. గుండె మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించి, శరీరంలో కదలిక మొదలైంది. ఈ నేపథ్యంలో సితి తండ్రి వైద్యులను తీసుకువచ్చాడు. వారు బాలికకు ఆక్సిజన్‌ అందించారు. అయితే ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు మృతదేహానికి మళ్లీ స్నానం చేయించి అక్కడి ఓ శ్మశానంలో ఖననం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు