జపాన్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రత

29 May, 2021 08:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టోక్యో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జీయోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. జపాన్‌లోని తకాహగికి 125 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: Hong Kong: జిమ్మీలాయ్‌కి 14 నెలల జైలు 

మరిన్ని వార్తలు