8-10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? 

24 Nov, 2020 19:53 IST|Sakshi

 సంపదలో బిల్‌ గేట్స్‌ను అధిగమించిన ఎలన్‌ మస్క్‌

 సోషల్‌ మీడియాలో మీమ్స్‌ సందడి

సాక్షి, న్యూఢిల్లీ:  ఏ రంగంలోనైనా సెలబ్రిటీలుగా ఉన్నవారికి భారీ క్రేజ్‌ ఉంటుంది. అందులోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రాణిస్తోంటే.. యువత ఆసక్తి మామూలుగా ఉండదు. తాజాగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ బిల్‌ గేట్స్‌ దాటేయడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో ఆయనపై సోషల్‌మీడియా అంతా మంగళవారం మీమ్స్‌ సందడి నెలకొంది. తమాషా వ్యాఖ్యలు, క్లిప్‌లు, ఇమేజ్‌లతో ట్విటర్‌ యూజర్లు సందడి చేస్తున్నారు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అన్నట్టు కమెంట్‌ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.. మీరూ సరదాగా నవ్వుకోండి. (మస్క్‌ దూకుడు: మరోసారి బిల్‌ గేట్స్‌కు షాక్‌)

మరిన్ని వార్తలు