కరోనాతో ఎస్వాటినీ ప్రధానమంత్రి కన్నుమూత 

15 Dec, 2020 07:52 IST|Sakshi

బబానే: కరోనా మహమ్మారి ఎస్వాటినీ(స్వాజిలాండ్‌) దేశ ప్రధానమంత్రిని పొట్టనబెట్టుకుంది. నవంబర్‌ రెండో వారంలో కరోనా బారిన పడిన ప్రధానమంత్రి ఆంబ్రోస్‌ మాండ్‌వులో లామినీ(52) దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఉప ప్రధానమంత్రి థెంబా మాసుకు సోమవారం ప్రకటించారు. వైరస్‌ వల్ల మరణించిన తొలి ప్రపంచస్థాయి నాయకుడు ఆంబ్రోస్‌ కావడం గమనార్హం. ఆయన 1968లో జన్మించారు. 2018లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఎస్వాతినీ దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆంబ్రోస్‌ రికార్డు సృష్టించారు. 
చదవండి: (రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్‌ గేట్స్‌)

మరిన్ని వార్తలు