UK: కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

6 Jul, 2021 18:56 IST|Sakshi

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.. జులై 19 నుంచి ఫేస్ మాస్క్‌లు, సామాజిక దూరం వంటి కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఇష్టం ఉంటే మాస్కులు ధరించవచ్చు అని అన్నారు.

ఇక భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఆగస్టు 4 నుంచి టెస్ట్‌ సిరీస్‌ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ను వీక్షించడానికి పూర్తిస్థాయిలో అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి బ్రిటన్‌ ప్రభుత్వం జూన్ 21న పూర్తి  ఆంక్షలను ఎత్తివేయాలనుకుంది. కానీ డెల్టా వేరియంట్‌ విజృంభన కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు