‘గోల్డెన్‌ కనరీ’ వజ్రం.. ధర రూ.123 కోట్లు.. అంచనా మాత్రమే!

18 Oct, 2022 07:57 IST|Sakshi

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్ద పసుపు రంగు ‘గోల్డెన్‌ కనరీ’ వజ్రం ఇది. దుబాయ్‌లోని సోత్‌బేస్‌ ప్రదర్శనలో ఉంచారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్‌లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించినపుడు దీని బరువు 890 క్యారెట్లు. తర్వాత పలుమార్లు సానబట్టి ముక్కలుగా మారింది. చివరకు 303.10 క్యారెట్లకు తగ్గించారు. అదే ఈ వజ్రం. డిసెంబర్‌ 7న న్యూయార్క్‌లో ఇది రూ.123 కోట్ల ధర పలకొచ్చని ఒక అంచనా.

ఇదీ చదవండి: పింక్‌ వజ్రానికి రికార్డ్‌ ధర.. రూ.480 కోట్లకు వేలం

మరిన్ని వార్తలు