కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..

7 May, 2023 07:35 IST|Sakshi

బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్‌ 3 వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బే నుంచి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్‌ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్‌ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది.

సమీపంలో ఓ మెటల్‌ బారీకేడ్‌ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డ​స్టేట్‌ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  

(చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి)

మరిన్ని వార్తలు