హౌతీ రెబల్స్‌ చెరలో ఎమిరేట్స్‌ నౌక

4 Jan, 2022 07:54 IST|Sakshi

దుబాయ్‌: తమకు మద్దతిచ్చిన ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసిమ్‌ సులేమానీని అమెరికా హతమార్చినందుకు ఆగ్రహంగా ఉన్న యెమెన్‌ హౌతీ రెబల్స్‌ ఎర్ర సముద్రంలో కలకలం రేపారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న యూఏఈకి చెందిన వాణిజ్య నౌకను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన సరకు నౌకల రాకపోకలకు కీలకమైన మార్గంలో ‘వాబీ’ షిప్‌ను సోమవారం సీజ్‌ చేసి హౌతీ రెబల్స్‌ ఉద్రిక్తత పెంచారు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా పత్రిక ‘జెరూసలేం పోస్ట్‌’కు చెందిన వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది.

మరిన్ని వార్తలు