ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి

4 Jun, 2022 14:05 IST|Sakshi

ఇస్తామాబాద్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్‌లోని ది చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు.  40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. 

(చదవండి: పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన అత్యంత వృద్ధుడు)

మరిన్ని వార్తలు