జాక్‌పాట్‌.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు

23 Jan, 2021 16:10 IST|Sakshi

లండన్‌: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. యూకేలోని భారత సంతతి చెందిన ఓ వ్యక్తికి అనుకోకండా  అదృష్టం తలుపు తట్టింది. లోట్టోలాండ్‌ నుంచి 3.3 కోట్ల రూపాయల జాక్‌పాట్‌ కోట్టి రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన షాజీ మథ్యూ అనే వ్యక్తి కటుంబంతో కలిసి యూకేలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అతడు సరదాగా అట్లాంటిస్‌ కాసియోఅండర్‌ వాటర్‌ థీమ్‌ ఆన్‌లైన్‌ స్లాట్‌ గేమ్‌ ఆడాడు. కొద్ది రోజులకు అతడికి లాట్టోలాండ్‌ నుంచి మెయిల్‌ వచ్చింది. ఆ మెయిల్‌లో అతడు డబ్బులు గెలుచుకున్నట్లు ఉంది. అయితే మొదట అతడికి నమ్మకం కలగలేదు. ఆ తర్వాత డబ్బులు గెలుచుకున్నట్లు లోట్టోలాండ్‌ నుంచి కాల్‌ వచ్చింది. అది ప్రాంక్‌ కాల్‌ నుకున్నాడు. చివరికి ఈ ప్రాసెస్‌ మొదలు పెట్టగా అతడు రూ. 3.3 కోట్లు గెలుచుకున్నాడు. (చదవండి: జాక్‌పాట్ అంటే నీదే త‌మ్ముడు)

దీనిపై షాజీ ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘జీవితంలో స్థిరపడటానికి సరిపోయే డబ్బు వచ్చింది. ఇప్పటికి నమ్మలేకపోతున్న. మొదట ఆ డబ్బు మూడున్నర లక్షలు అనుకున్నాను. అందులో మొత్తం ఎనిమిది అంకేల డిజిట్‌ ఉందని, ఆ మొత్తం అక్షరాలు మూడున్నర కోట్లని వారు చెప్పేవరకు కూడా నేను గుర్తించలేదు. అప్పటి వరకు నేను అది మూడున్నర లక్షలే అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. త్వరలో అతడి వివాహ వార్షికొత్సవం ఉందని, సంతోషంగా కుటుంబంతో కలిసి పెళ్లిరోజును వేడుకలా చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత తన భార్యతో జాయింట్‌ అకౌండ్‌ తీసుకుని అందులో ఈ డబ్బును దాస్తానని, ఇందులో కొంత మొత్తాన్ని తమ పిల్లల పైచదువుకు, ఇంటి నిర్మాణం ఖర్చు చేస్తానని చెప్పాడు. ఇక మరికొంత డబ్బును అనాథాశ్రమానికి ఇస్తానన్నాడు. కాగా లోట్టోలాండ్ అట్లాంటిస్‌ కాసియో‌ ఆన్‌లైన గేమ్‌ లాటరీని ఆసియాలో 2013లో ప్రారంభించారు. (చదవండి: ఆ యాచకులు రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు!)

మరిన్ని వార్తలు