మద్యధరా సముద్రంలో 130 మంది మృతి!

24 Apr, 2021 02:09 IST|Sakshi

కైరో: 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్‌ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు.    

మరిన్ని వార్తలు