బూస్టర్‌ డోస్‌ వేసుకున్నా కమలా హారిస్‌కు కరోనా

27 Apr, 2022 21:27 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కరోనా (57) బారిన పడ్డారు. మంగళవారం చేసిన రాపిడ్, పీసీఆర్‌ పరీక్షలు రెండింట్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేమీ కన్పించలేదు. నెగెటివ్‌గా తేలేదాకా ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు.

కమల నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్యకు కరోనా సోకే ప్రమాదమేమీ లేదని ఆమె ప్రెస్‌ సెక్రెటరీ కిర్‌స్టెన్‌ అలెన్‌ తెలిపారు. ఏప్రిల్‌ 18 నుంచి వారిని ఆమె కలవలేదని వివరించారు. కమల కరోనా రెండు డోసులతో పాటు రెండు బూస్టర్‌ డోసులు కూడా వేసుకున్నారు. ఆమె భర్త డగ్‌ ఎమోఫ్‌ నెల క్రితమే కరోనా బారిన పడి కోలుకున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు, వైట్‌హౌస్‌ ఉన్నతాధికారులకూ కరోనా సోకింది. 

చదవండి: (4,800 కోట్ల డాలర్లతో జపాన్‌ అత్యవసర ప్యాకేజీ)

మరిన్ని వార్తలు