పాకిస్తాన్‌లో హిందూ జనాభా ఎంతో తెలుసా?

10 Jun, 2022 10:18 IST|Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్తాన్‌ వెల్లడించిన నివేదిక పేర్కొంది. దేశ జనాభాలో మైనారిటీల వాటా 5% కాగా, వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక ఉటంకించింది.

దేశంలో 1,400 మంది నాస్తికులు సహా 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో వెల్లడించిన ఎన్‌ఏడీఆర్‌ఏ డేటా పేర్కొంది.  హిందూ జనాభాలో 95% మంది సింధ్‌ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారంది. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల ప్రాతినిధ్యం పాక్‌ చట్టసభల్లో దాదాపుగా లేనట్లేనని వెల్లడించింది. మైనారిటీలపై వేధింపులు సర్వసాధారణమని ఈ నివేదిక తెలిపింది.   
చదవండి: అణు నిఘాను ఇరాన్‌ అడ్డుకుంటోంది

మరిన్ని వార్తలు