22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్‌

2 May, 2021 01:18 IST|Sakshi

ఖట్మాండూ: భారత్‌లో కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం భారత సరిహద్దులో ఉన్న 22 ప్రవేశ మార్గాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ఉన్న 35 బోర్డర్‌ పాయింట్లలో 22 మార్గాలను మూసేయాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉన్నాయి. 

చదవండి: (భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం)

మరిన్ని వార్తలు