‘మా జోలికి వస్తే సహించం’: ఉత్తర కొరియా హెచ్చరిక

4 Oct, 2021 06:15 IST|Sakshi

సియోల్‌: బాలిస్టిక్‌ క్షిపణుల అంశంలో తమ జోలికి వస్తే సహించబోమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షలు వరుసగా నిర్వహించడంపై భద్రతా మండలి  ఆందోళన వ్యక్తం చేసింది.  యూఎన్‌ తీర్మానం ప్రకారం ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. 

చదవండి: (అదిగదిగో ప్లానెట్‌ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా)

మరిన్ని వార్తలు