ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం

29 Nov, 2020 05:24 IST|Sakshi
పారిస్‌లో నిరసనకారులు తగులబెట్టిన కారు మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

పారిస్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలను షేర్‌ చేయడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా బిల్లుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అనంతరం ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్‌ దిగువ సభలో ఆమోదం పొందింది. ఇక సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోలు తీయడం, వాటిని షేర్‌ చేయడం వంటివి చేస్తే ఏడాది జైలు శిక్ష, 53 వేల డాలర్ల జరిమానా విధిస్తారు.
 

మరిన్ని వార్తలు