ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన

30 Sep, 2022 05:37 IST|Sakshi

కీవ్‌: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్‌లో 87%, లుహాన్‌స్క్‌లో 98%, డొనెట్‌స్క్‌లో 99% మంది రష్యాకు అనుకూలంగా  ఓటేశారని క్రెమ్లిన్‌ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్‌ కోటలోని సెయింట్‌ జార్జి హాల్‌లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్‌ చెప్పారు.

విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్‌ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్‌ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్‌ నిఘా వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు