మిసిసిపీ ఫెస్టివల్‌లో అపశ్రుతి

1 May, 2022 14:23 IST|Sakshi

మిసిసిపీలో శనివారం జరిగిన మడ్‌బగ్ ఫెస్టివల్‌లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన మిసిసిపీ స్టేట్ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో చోటు చేసుకుంది ఈ మేరకు మిసిసిపీ అధికారి హిండ్స్ కౌంటీ షెరీఫ్ టైరీ జోన్స్ ఈ ఉత్సవంలో పలువురు గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఈ ఉత్సవంలో జరిగిన కాల్పుల్లో పాల్లొన్నవారిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్‌లో ప్రత్యక్ష వినోదం, వంటల పోటీలు, వినోద ఉద్యానవనాలు తదితరాలు ఉంటాయి. మిసిసిపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ స్థానికుల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఐతే ఈ ఘటన పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

(చదవండి: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌)

మరిన్ని వార్తలు