రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!

4 Nov, 2020 15:35 IST|Sakshi

ఆమ్‌స్టర్‌ డ్యామ్‌: నెదర్లాండ్‌లో ఒక సబ్‌వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్‌ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్‌ డామ్‌ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఆర్కిటెక్ట్‌  స్ట్రూయిజ్స్  అనే వ్యక్తి  20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి  స్ట్రూయిజ్‌ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్‌ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు.  ఆ సమయంలో లోకో పైలెట్‌ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్‌.. డాడీ అంటూ..

మరిన్ని వార్తలు