ప్లాస్టిక్‌కి చెక్‌పెట్టేలా... నీటిని ఫిల్టర్‌ చేసే చేప

26 Oct, 2022 16:12 IST|Sakshi

మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్‌ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్‌ కారణంగా చనిపోతున్నాయి. ఇప్పుడూ ఆ ప్లాస్టిక్‌ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్‌ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు.

వివరాల్లోకెళ్తే...తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల​ కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్‌ని ఏరేసి ఫిల్టర్‌ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్‌ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్‌లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్‌ రోబోటిక్స్‌ కాంటెస్ట్‌ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్‌ ఎలియనోర్‌ మాకింతోష్‌ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు.

ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ సిడాల్‌ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్‌ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్‌ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్‌ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది.

నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్‌పాప్‌కి ఉన్న మెష్‌ ద్వారా ఫిల్గర్‌ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్‌ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్‌ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు.

(చదవండి: షాకింగ్‌.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ)

మరిన్ని వార్తలు