చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు

27 Oct, 2021 15:34 IST|Sakshi

వాషింగ్టన్‌: టెక్సాస్‌లో ఓ తల్లి తన నలుగురి పిల్లల్ని హ్యస్టన్‌ అపార్ట్‌మెంట్‌లో వదిలేసి తన భాగస్వామితో కలిసి ఉంటోంది. పైగా ఆమె తన భాగస్వామితో కలిసి ఒక కొడుకుని హత్య చేసి చంపేసిందనే అనుమానంతో ఆమెను అరెస్టు చేసినట్లు టెక్సాస్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొడుకులు ముగ్గురు హ్యుస్టన్‌ అపార్ట్‌మెంట్‌లో చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజర అవశేషాలతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు.

(చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!)

ఈ క్రమంలో ఆ పిల్లలు తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను  తారుమారు చేసే నిమిత్తం ఆ పిల్లలను గాయపరిచినట్లు తెలిపారు. అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని, చాలా కాలంగా తలితండ్రులిద్దరూ అక్కడ నివశించటం లేదని పేర్కొన్నారు.

అయితే ఆ పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. అంతేకాదు ఆ ముగ్గురి పిల్లల్లో ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని చెబుతున్నారని పోలీసులు అన్నారు. 

(చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ)

మరిన్ని వార్తలు