కొలువు తీరనున్న కొత్త మంత్రివర్గం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరనుంది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పాక్ పీఠం షాబాజ్కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు.
కరోనా ముప్పు తొలగలేదు
కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోయిందని అనుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూపుమార్చుకుని మళ్లీ అది ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు.
టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది.
పెళ్లి భోజనం పెట్టలేదని.. కుల బహిష్కరణ
కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు.
IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్!
ఐపీఎల్లో ‘హ్యాట్రిక్’ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్జెయింట్స్ జోరుకు బ్రేక్ పడింది. రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ముందు లక్నో తలవంచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ 3 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు.
ధరల దాడిని ఇలా ఎదుర్కోండి..!
పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది.
సూటు..బూటు..బీఎండబ్య్లూ కారు
ఐఏఎస్ అధికారిగా ప్రచారం చేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ– జో బైడెన్ కీలక భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్గా సమావేశం కానున్నారు. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఇది జరుగుతుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు.