'అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్' అవార్డు

22 Dec, 2020 09:33 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు వరించింది. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి కృషిచేసినందుకు గానూ మోదీకి ఈ అవార్డును అందజేశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాజర్ట్‌ ఓబ్రెయిన్‌ చేతులమీదుగా మోదీ తరుఫున భారత రాయబారి తరణ్‌జిత్ ఈ అవార్డును స్వీకరించారు. ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని మోదీ కృషి చేసినందుకు ఆయను ఈ అవార్డును ప్రకటించినట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. యూఎస్ మిలటరీ విభాగంలో అత్యన్నత పురస్కారంగా భావించే  ఈ అవార్డును ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు ప్రధానం చేస్తారు. 

యూఎస్ - ఇండియా సంబంధాలు మరింతగా బలపడటం వెనుక నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా  రాబర్ట్ ఓబ్రియన్ కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రపంచం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకరిస్తున్నాయని ట్వీట్‌ చేశారు. భారత్‌- అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడం, భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేలా పాటుపడుతున్నందుకు  మోదీకి ఈ అవార్డు లభించింది. గతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేలకు కూడా అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. 

మరిన్ని వార్తలు