మొన్న భూకంపం.. ఇప్పుడు వరదల బీభత్సం.. టర్కీలో 14 మంది మృతి

16 Mar, 2023 08:00 IST|Sakshi

అంకారా: ప్రకృతి ప్రకోపంతో టర్కీ వణికిపోతోంది. వేలాది మందిని బలిగొన్న భీకర భూకంప ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టర్కీలో వరదలు ముంచెత్తుతున్నాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

వరదల వల్ల ఇప్పటిదాకా 14 మంది మృతిచెందారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కనీసం ఇద్దరు కనిపించకుండాపోయారని తెలియజేశాయి.

మరిన్ని వార్తలు