ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో హైదరాబాదీ!

10 Sep, 2021 03:34 IST|Sakshi

లండన్‌: ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్‌ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్‌ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్‌ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్‌హెడ్‌ గ్లోబల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీ ఛైర్‌ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు