యూఏఈకి వెళ్లే వారికి ఊరట 

25 Aug, 2021 08:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నవంబర్‌ 10 వరకు వీసాల గడువు పెంపు 

మోర్తాడ్‌ (బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి సెలవులపై ఇంటికి వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసాల గడువును నవంబర్‌ 10 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి నవంబర్‌ 9 లోపు గడువు ముగిసే వీసాలను పొడిగించింది. ఈ మేరకు దుబాయ్‌ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్స్, ఫారెన్‌ ఎఫైర్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశంతో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల వలస కార్మీకులకు ఎంతో మేలు కలుగనుంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు గతంలో సెలవులపై సొంతూళ్లకు చేరుకున్నారు. 

>
మరిన్ని వార్తలు