అమెరికాలో మళ్లీ కాల్పులు

17 Oct, 2022 06:27 IST|Sakshi

పిట్స్‌బర్గ్‌: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.

శనివారం రాత్రి 10 గంటలకు నార్త్‌సైడ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. కాల్పులకు బాధ్యులు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కాల్పులు జరిపింది ఒక్కరేనా లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది.

మరిన్ని వార్తలు