-

ఆ జర్నలిస్ట్‌ వర్క్‌ డెడికేషన్‌ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు

29 Aug, 2022 15:37 IST|Sakshi
పీకల్లోతు నీళల్లో నిలబడి వరదల గురించి లైవ్‌ రిపోర్టింగ్‌ ఇస్తున్న పాకిస్తానీ రిపోర్టర్‌

పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పాకిస్తాన్‌లో వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు.

దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి  సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు సాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్‌ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు.

ఈ క్రమంలో ఒక రిపోర్ట్‌ర్‌ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధిచి లైవ్‌ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్‌ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్‌ డెడికేషన్‌ వర్క్‌కి హ్యాట్సాప్‌ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్‌ కోసైం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది)
 

మరిన్ని వార్తలు