న్యూయార్క్: ట్విట్టర్ కొనుగోలు పూర్తయ్యాక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘ కుంభకోణాలు, నకిలీ ఖాతాల వంటి ఘటనల్లోనే శాశ్వత నిషేధం అమలుచేయాలి. ట్రంప్పై నిషేధం సహేతుకం కాదు. ట్విట్టర్ కొనుగోలు పూర్తయ్యాక ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తా’ అని ఒక కార్యక్రమంలో ఎలాన్ మాట్లాడారు.
అమెరికా పార్లమెంట్పై దాడికి కారణమయ్యేలా ఆయన మద్దతుదారులనుద్దేశిస్తూ నాడు విద్వేష ప్రసంగం ఆరోపణలపై 2021 జనవరిలో ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించడం తెల్సిందే.