గ్లాస్గోలో ప్రధాని మోదీని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి

2 Nov, 2021 23:06 IST|Sakshi

గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలో జరుగుతున్న క్లైమేట్ పార్లమెంట్ సదస్సులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీ మిథున్ రెడ్డి కలిశారు. ఈ సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు ఎంపీలతో కూడిన బృందం గ్లాస్గోకు వెళ్లింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన చర్యలపై ఈ బృందం సదస్సులో చర్చించనుంది.

వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్‌ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి భారత్‌ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్‌–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు.
చదవండి: కాప్‌ 26 సదస్సులో జోబైడెన్‌ కునికిపాట్లు

మరిన్ని వార్తలు