నిధులు దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

28 Mar, 2023 00:18 IST|Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): బీర్‌పూర్‌ గ్రామైక్య సంఘంలో రూ.14.50 లక్షల సొంతానికి వినియోగించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువచైతన్య యూత్‌ సభ్యులు సోమవారం జగిత్యాలలో కలెక్టర్‌ యాస్మిన్‌బాషాకు ఫిర్యాదు చేశారు. గ్రామైక్య సంఘం పరిధిలో 15 మహిళా సంఘాలు ఉన్నాయని, ఇందులో 11 సంఘాల్లోని మహిళలు రూ. 2017–18లో సీ్త్రనిధి ద్వారా రూ.14.50 లక్షల రుణం మంజూరైందని తెలిపారు. మహిళలు తమకు రుణం వద్దని తిరస్కరించారని, దీంతో రూ.14.50 లక్షలు మళ్లీ గ్రామైక్య సంఘంలో జమ చేశారని పేర్కొన్నారు. ఈ సొమ్మును కొందరు స్వాహా చేశారని, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

మరిన్ని వార్తలు