గండేపల్లి: బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు గండేపల్లి ఎస్సై వై.గణేష్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కె.గోపాలపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక గండేపల్లి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వివాహితుడు వేమగిరి సత్యానందం కొంత కాలంగా ఆ బాలిక వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై పెద్దల సమక్షంలో పలుమార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న స్కూల్కు వెళ్లేందుకు ఆటో కోసం ఇంటి బయట వేచి ఉన్న ఆ బాలికకు సత్యానందం మాయమాటలు చెప్పి, మోటార్ సైకిల్పై కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం ముద్దాయిని సోమవారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్కు ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.