ఓటర్ల అభ్యంతరాలకు అవకాశం

22 Mar, 2023 02:04 IST|Sakshi

బనశంకరి: ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే ఓటర్లు అభ్యంతరాలు తెలపవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్‌కుమార్‌ మీనా మంగళవారం తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించేటప్పుడు సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు. స్థలాంతర, మృతిచెందిన ఓటర్లను గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలని, ఏ ఓటరునూ వారి హక్కు నుంచి దూరం చేయరాదని కొత్తగా అభ్యంతరానికి అవకాశమిచ్చినట్లు ఆయన తెలిపారు. శాంతినగర, రాజరాజేశ్వరి నగర, శివాజీనగర నియోజకవర్గాల్లో ఇంటింటి సర్వే ద్వారా 16,040 మంది స్థలాంతర, మృతిచెందిన ఓటర్లను గుర్తించామని, ఈ జాబితాను రాజకీయపార్టీలకు పంపించామని చెప్పారు.

మరిన్ని వార్తలు