తుమకూరు: వచ్చే రెండున్నర నెలలు పార్టీకి ఎంతో కీలకమని, కార్యకర్తలు, నేతలు విరామం లేకుండా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని మాజీ సీఎం యడియూరప్ప పిలుపునిచ్చారు. మంగళవారం తుమకూరు సమీపంలోని బెల్లావి గ్రామంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గడచిన తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ విశ్రాంతి లేకుండా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, అదే తరహాలో మాజీ ఎమ్మెల్యే బీ. సురేష్ గౌడ విరామం లేకుండా పనిచేస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు కలిసి వచ్చే ఎన్నికల్లో తుమకూరు రూరల్లో సురేశ్గౌడను గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత సీటీ రవి తదితరులు పాల్గొన్నారు.
బీఎంటీసీ
బస్సులు ప్రారంభం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నుంచి బెంగళూరుకు బీఎంటీసీ ఏసీ బస్సులను మంగళవారం నగరంలోని పాత బస్టాండ్లో వైద్యశాఖ మంత్రి సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్థానికుల డిమాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేశామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.