డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్‌ షర్మిల భేటీ

30 May, 2023 07:14 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. సోమవారం బెంగళూరు సదాశివనగరలోని డీకే నివాసంలో షర్మిల ఆయనతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబానికి డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కన్నడనాట కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో షర్మిల ఆయనకు శుభాభినందనలు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇదొక మర్యాదపూర్వకమైన భేటీ అని డీకే శివకుమార్‌ కార్యాలయం తెలిపింది.

మరిన్ని వార్తలు