బెంగళూరు సీపీగా దయానంద్‌

31 May, 2023 06:26 IST|Sakshi

బనశంకరి: కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన పదిరోజులకు పోలీసు శాఖలో బదిలీలు చేసింది. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అయిన బీ.దయానంద్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న సీహెచ్‌ ప్రతాప్‌రెడ్డిని అంతర్గత భద్రత విభాగం చీఫ్‌గా బదిలీచేశారు. సిటీ ట్రాఫిక్‌ విభాగం ప్రత్యేక కమిషనర్‌, ఏడీజీపీ ఎంఏ.సలీంకు పదోన్నతి కల్పించి సీఐడీ విభాగాధిపతిగా నియమించారు. మొత్తం మీద నలుగురు ఐపీఎస్‌లకు స్థానచలనం అయ్యింది. ఇక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఏడీజీపీ శరత్‌ చంద్రను నియమించారు. మండ్య జిల్లా కిక్కేరి కి చెందిన శరత్‌చంద్ర 1997 బ్యాచ్‌ ఐపీఎస్‌. నిఘా విభాగం సీఎం చేతిలో ఉండడం తెలిసిందే. కొత్త కమిషనర్‌ దయానంద్‌ తండ్రి అష్టమూర్తి కూడా పోలీస్‌ అధికారి, ఆయన గతంలో నగరంలో సీసీబీ జాయింట్‌ కమిషనర్‌గా పనిచేశారు. వీరి స్వస్థలం బళ్లారి జిల్లా హరపనహళ్లి.

నిఘా చీఫ్‌గా శరత్‌చంద్ర

మరిన్ని వార్తలు