చాతి నొప్పితో విద్యార్థిని అవస్థలు

22 Mar, 2023 00:42 IST|Sakshi

కొమరం భీమ్: తీవ్ర చాతి నొప్పితో బాధపడుతూ ఓ గిరిజన విద్యార్థిని నానా అవస్థలు ఎదుర్కొన్న సంఘటన మంగళవారం తిర్యాణి మండలంలో చో టు చేసుకుంది. విద్యార్థులు, గిన్నెధరి వైద్యురాలు ఆయేషా తెలిపిన వివరాల ప్రకారం.. గిన్నెధరి ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుప్రియ అనే విద్యార్థిని మంగళవారం చాతి నొప్పితో విలవిలలాడింది. తోటి విద్యార్థినులు గమనించి సుప్రియను వెంటనే తిర్యాణి ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థిని నొప్పితో బాధపడుతున్నా ఉపాధ్యాయులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు