19న మహిళా ఆంధ్రా కబడ్డీ జట్టుకు ఎంపిక పోటీలు

18 Mar, 2023 01:58 IST|Sakshi

కర్నూలు(టౌన్‌): గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఈనెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు సీనియర్‌ మహిళా ఆంధ్రా కబడ్డీ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈఓ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన జిల్లా మహిళా కబడ్డీ క్రీడాకారిణులు నేరుగా ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికయిన వారు ఈనెల 23 నుంచి 26 వరకు హర్యానాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సీనియర్‌ మహిళా ఆంధ్రా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు