సాక్షి, హైదరాబాద్: డీజీపీ మహేందర్రెడ్డి ఈనెల 18 నుంచి వచ్చే నెల 4 వరకు మెడికల్ లీవ్లో వెళ్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డీజీపీగా ఏసీబీ డీజీ అంజనీకుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సెలవు నుంచి వచ్చిన తర్వాత మహేందర్రెడ్డి డీజీపీగా తిరిగి బాధత్యలు స్వీకరిస్తారని అందులో వివరించారు.